జులై 2009 నుండి టపాలు

జులై 30, 2009

పదవులు ఊడాయ్

హైదరాబాద్: కేంద్ర సాంకేతిక విద్యా మండలి(ఎఐసిటిఇ) పెద్దలకు కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అవినీతి కేసులలో ఇరుక్కున్న మండలి సభ్య కార్యదర్శి కె నారాయణరావును ఆ పదవి నుంచి తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యునిగా పనిచేసి పదవీ విరమణ చేసిన నారాయణరావు మూడేళ్ళ క్రితం మండలి సభ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. దేశంలో సాంకేతిక కళాశాలల అనుమతులకు లక్షల రూపాయలు ముడుపులు స్వీకరిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకు సిబిఐ చేసిన దాడుల్లో నారాయణరావు రెడ్ హ్యాండెడ్ [...]

జులై 30, 2009

`సారీ’ల సభ

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నాడు ఆరోగ్యకరమైన వాతావరణం కనిపించింది. ప్రతిపక్ష నాయకులు, అధికార పక్షం నాయకులు, చివరకు సభాపతి కూడా పరస్పరం క్షమాపణలు చెప్పుకున్నారు. గత మూడు రోజులుగా ఆవేశాలతో వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచారు. పంతాలను, పట్టింపులను పక్కన పెట్టి బడ్జెట్ సమావేశాల నాలుగో రోజును సజావుగా నడుపుకునేందుకు అవకాశం కల్పించారు. సభ ప్రారంభం కాగానే ఒకరి వెంట ఒకరు `సారీ’లు చెబుతుంటే సభ్యులంతా హర్షాద్వానాలు చేశారు. ఈ నాయకులను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు.
ముందుగా స్పీకర్ [...]

జులై 30, 2009

ప్రతిపక్షాల వాకౌట్

హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ హస్టల్ విద్యార్ధులకు సరైన పౌష్టికాహారం అందించడానికి రోజువారీ భత్యాన్ని పెంచాలని శాసనసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనికి ప్రభుత్వం స్పందించకపోవడానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, భారతీయ జనతా పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రజారాజ్యం పార్టీ, తెలంగాణారాష్ట్ర సమితి మాత్రం నిరసన తెలిపాయి. ఈ అంశంపై తెలుగుదేశం ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహం మాట్లాడుతూ వసతి గృహాల్లో విద్యార్దులు ఆకలితో అల్లాడిపోతున్నారని అన్నారు. సరైన ఆహరం లభించక అనారోగ్యాల పాలవుతున్నరని చెప్పారు. [...]

జులై 30, 2009

ఇక నుంచి ఐఐటీ వైద్యులు!

న్యూఢిల్లీ: ఇప్పటివరకు ఇంజినీర్లను తయారు చేసిన ఐఐటీ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లు సామాజిక శాస్త్రవేత్తలు, వైద్యులు, న్యాయవాదులను కూడా అందించనున్నాయి. తమ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు ప్రైవేట్ భాగస్వాములను ఖరగ్ పూర్ ఐఐటీ ఆహ్వానించింది. ఆస్పత్రి ఏర్పాటైతే ఎంబీబీఎస్ కోర్సును ఇక్కడ ప్రారంభించే అవకాశాలు మెరుగౌతాయి. ”మెడికల్ సైన్స్, టెక్నాలజీ పాఠశాల ఇప్పటికే ఉంది. ఆస్పత్రి అవసరం ఉందని కొంతకాలంగా ఉంది” అని ఖరగ్ పూర్ ఐఐటీ డైరెక్టర్ డీ ఆచార్య తెలిపారు. [...]

జులై 30, 2009

‘రావణ్’ షూటింగ్ లో ప్రమాదం

తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు మణిరత్నం పలు అవరోధాల మధ్య ‘రావణ్’ షూటింగ్ ను మళ్లీ సెట్స్ పైకి తీసుకువచ్చినప్పటికీ దురదృష్టం మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేరళలోని చాలక్కుడి సమీపంలో ఉన్న అతిరప్పలి జలపాతాల వద్ద షూటింగ్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన కుంజు అనే ఏనుగు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఏనుగును లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన ట్రయినర్, మావటి ఆండవన్ ను తొక్కి చంపింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న [...]