తెలుగుపీపుల్ డైరెక్టరీ

న్యూజెర్సీ: అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడిన తెలుగు ప్రముఖులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు, సంస్థల వివరాలతో కూడిన ఒక డైరెక్టరీని ప్రచురించేందుకు తెలుగుపీపుల్.కామ్ నడుం బిగించింది. జూలై 2న షికాగోలో ప్రారంభమయ్యే ‘తానా’ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ తోటకూర ప్రసాద్ ‘తెలుగుపీపుల్ నార్త్ అమెరికా డైరెక్టరీ’ బ్రోచర్ ను ఆవిష్కరిస్తారు. ఆవిష్కరించిన బ్రోచర్ తొలి కాపీని ఆయన అదే వేదికపై ప్రముఖ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకులు [...]

ఓర్వలేకే ప్రతిపక్షాలు ఆరోపణలు: డీఎస్‌

హైదరాబాద్‌: బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ… ప్రతిపక్షాలు ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రానికి, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకోళ్తోందని డీఎస్‌ చెప్పారు. ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ ఆశించిన ఓట్ల శాతం ఎందుకు రాలేదని విశ్లేషణ చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్లు భావిస్తున్నట్లు డీఎస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య కన్నా 20శాతం ఎక్కువగా రేషన్‌కార్డులు జారీ [...]

దుర్గామాతకు భూరి విరాళం

విజయవాడ: విజయవాడ నగరానికి చెందిన ఓ అజ్ఞాత భక్తుడు దుర్గామాతకు భూరి విరాళాన్ని హూండీ ద్వారా సమర్పించారు. రూ.1.25 కోట్ల విలువైన 84 బంగారు బిస్కెట్లను సమర్పించారు. వాటిని ఆలయ తాపడం పనులకు వాడాలని ఆయన ఈఓకు రాసిన లేఖలో కోరారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే బంగారాన్ని కొనుగోలు చేశానని, ఆదాయపు పన్ను చెల్లించానని అజ్ఞాత భక్తుడు లేఖలో పేర్కొన్నారు.

తెరాసలో సమసిన వివాదం: ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలో నెలకొన్న వివాదం సమసిపోయిందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ తెలిపారు. బహిష్కృత నేతలతో చేపట్టిన చర్చలు సఫలమయ్యాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సమైక్యవాదాన్ని కలసికట్టుగా వ్యతిరేకిస్తామని పేర్కొన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని పనిచేస్తామని వినోద్‌కుమార్‌ చెప్పారు.

తెదేపా ఎమ్మెల్యేలకు దక్కని అనుమతి

హైదరాబాద్‌: కొవ్వూరు ఎమ్మెల్యే టీవీరామారావుపై కేసు ఎత్తివేయాలనిముఖ్యమంత్రిని కోరడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం కార్యాలయంలో అనుమతి లభించలేదు. వై.ఎస్‌ను క్యాంపు కార్యాలయంలో కలవాలని నిర్ణయించుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.

కాంగ్రెస్‌ జిల్లా సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్‌: ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ జిల్లా సమన్వయకర్తలను నియమించింది. పీసీసీ అధినేత డీఎస్‌ ఈ జాబితాను విడుదల చేశారు.ఐ. రామకృష్ణంరాజు (శ్రీకాకుళం), మాదాసు గంగాధర్‌ (విజయనగరం), బి. రామకృష్ణరాజు (విశాఖపట్నం), వి. రాజవర్థన్‌రెడ్డి ( విశాఖ నగరం), కె.వి. నాగేశ్వర్‌యాదవ్‌ (తూర్పుగోదావరి, కాకినాడ నగరం), ఎస్‌. గోపాల్‌ (రాజమండ్రి నగరం), తోట వెంకట నరసింహం( పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు నగరం), సంభాని చంద్రశేఖర్‌ (కృష్ణా), జి. వినోద్‌రెడ్డి( విజయవాడ నగరం), మండలి బుద్ధప్రసాద్‌ (గుంటూరు జిల్లా, గుంటూరు [...]

వెస్టిండీస్‌పై భారత్‌ గెలుపు

కింగ్‌స్టన్‌: విండీస్‌తో జరిగిన తొలి వండేలో భారత్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ విధించిన 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ 319 పరుగులకు ఆలౌటు అయింది. చందర్‌పాల్‌ 63(59), సర్వాన్‌ 45(42), మోర్టాన్‌ 42(51), గేల్‌ 37(33) పరుగులతో రాణించారు. భారత్‌ బౌలర్లలో నెహ్రా, పఠాన్‌ మూడేసి వికెట్లు, ఆర్పీసింగ్‌, ఇషాంత్‌శర్మ, హర్భజన్‌సింగ్‌ ఒక్కో వికెట్‌ తీశారు. అద్భుతమైన సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చిన యువరాజ్‌కు మ్యాన్‌ఆఫ్‌దమ్యాచ్‌ లభించింది. అంతకుముందు [...]

ఒడిదుడుకుల మయం.. మైఖేల్‌ పయనం

లాస్‌ ఏంజెల్స్‌: 40 ఏళ్లపాటు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలుగించిన మైఖేల్‌ జాక్సన్‌ జీవిత ప్రస్థానం ఆద్యం ఉడిదుడుకుల మధ్యనే సాగింది. తన ఐదో ఏటనే పాప్‌ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన జాక్సన్‌ ప్రపంచ మంతటా తన అభిమానులను సంపాదించుకున్నాడు. 13 గ్రామీ అవార్డులను, ఏడు యూకే నంబర్‌వన్‌ అవార్డులను గెలుచుకున్నాడు. తన జీవిత కాలంలో 750 మిలియన్ల మ్యూజిక్‌ వీడియోలు అమ్ముడుబోయాయి. పాప్‌ సంగీత రారాజు మైఖేల్‌ గమనాన్ని ఒకసారి పరిశీలిస్తే.. – 1958 ఆగస్టు 29న [...]

ఇక టీఆర్‌ఎస్‌ పల్లెబాట : కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకు రావడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షడు కేసీఆర్‌ అన్నారు. ఇందుకోసం పల్లెబాట పడదామని, నెలలో వారం రోజులు ఊర్లళ్లో నిద్రిద్దామని పార్టీ నాయకులకు కేసీఆర్‌ సూచించారు. పల్లెబాట ద్వారా ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను వివరించి వారిని చైతన్యవంతులను చేసి ఉద్యమానికి మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని కేసీఆర్‌ తెలిపారు.

సూర్యుని గుర్తుకే ప్రాధాన్యత : చిరంజీవి

హైదరాబాద్: సూర్యుడు, గొడుగు, రెండాకుల గర్తుల్లో ఏదో ఒకటి కేటాయించమని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పీఆర్‌పీ అధినేత చిరంజీవి తెలిపారు. సూర్యని గుర్తుకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని చిరు తెలిపారు. రానున్న గ్రేట్‌ర్‌ ఎన్నికల్లో 150 కి పైగా స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతామాని, సమర్థులకే టిక్కెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు.

Follow

Get every new post delivered to your Inbox.