జూన్ 2009 నుండి టపాలు

జూన్ 30, 2009

డీఎస్సీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: డీఎస్పీ ఫలితాలు విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఈ రోజు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 52,675 పోస్టులకు గాను, 5,47,220 మంది పరీక్ష రాశారని అన్నారు. మొత్తం 93 తప్పుడు ప్రశ్నలకు గాను అర మార్కు కలుపుతున్నట్లు చెప్పారు. వచ్చే నెలాఖరులో నియామకాలు ఉండవచ్చు. ఈ ఫలితాలను www.suryaa.com, www.manabadi.com, www.schools9.com, deccanpost.com లో చూడవచ్చు.

జూన్ 30, 2009

2014 నాటికి సమగ్రాభివృద్ధి: వైఎస్‌

హైదరాబాద్‌: 2014 నాటికి మురికివాడల సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారులను సూచించారు. మున్సిపల్‌ శాఖాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి మున్సిపాల్టీలో రెండు, మూడు గంటలు మంచినీటిని అందిస్తున్నామని, 2011 నాటికి 24 గంటలు నీటిని అందించేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. అలాగే 166 జీవోలో మార్పులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జూన్ 30, 2009

ప్రజా భద్రత, రక్షణ కోసం సలహాసంఘం

హైదరాబాద్‌: ప్రజా భద్రత, రక్షణ కోసం సలహా సంఘాన్ని ప్రభుత్వం నియమించింది. దీనికి చైర్మన్‌గా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, కో డైరెక్టర్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌లు వ్యవహరిస్తారు. సభ్యులుగా హోం శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఇంటెలిజెన్స్‌ అడిషనల్‌ డీజీపీ, ఫైర్‌ సర్వీసెస్‌ డీజీపీ, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌లు ఉంటారు.

జూన్ 29, 2009

వరుణయాగం ఫలితాలనిస్తోంది : గాదె

హైదరాబాద్: రాష్టవ్య్రాప్తంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వరుణయాగం సత్ఫలితాలను ఇస్తోందని ఆ శాఖ మంత్రి గాదె వెంకట్‌ రెడ్డి తెలిపారు. సికింద్రాబాదులోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి వరుణ యాగం, సహస్రాభిషేకం నిర్వహించారు. వరుణ యాగం వల్ల గత ఐదేళ్లలో విస్తారంగా వర్షాలు కురిసాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. జూలై 2 నుంచి మూడు రోజుల పాటు టీటీడీ ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

జూన్ 29, 2009

గ్రేటర్‌ ఎన్నికలపై పీసీసీ కసరత్తు

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు ప్రారంభించింది. గాంధీ భవన్‌లో జరగుతున్న కాంగ్రెస్‌ పార్టీ సమీక్ష సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌, డీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లతో చర్చించారు. పార్టీ గెలుపునకు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు.అనంతరం వీరప్పమొయిలీ మాట్లాడుతూ గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో పొత్తుల నిర్ణయం రాష్ట్ర [...]