న్యూయార్క్: రోజురోజుకు స్వైన్ఫ్లూ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధితో 42 మరణించగా, వ్యాధిసోకిన వారి సంఖ్య 1,070కు చేరింది. 2,099 మందిలో స్వైన్ఫ్లూ లక్షణాలను గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఒక్క మెక్సికోలో 1,112 కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అమరికాలోని 41 రాష్ట్రాల్లో 896 స్వైన్ఫ్లూ కేసులు నమోదు కాగా కెనడాలో 201, స్పెయిన్లో 73 మందికి ఈ వ్యాధి సోకింది.
మే 2009 నుండి టపాలు
మే 8, 2009
కసబ్ దాడిని వివరించిన ప్రత్యక్ష సాక్షి
ముంబయి: గతేడాది నవంబరు 26 ముంబయి దాడి కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో జరిగిన విచారణలో ఆ నాటి ఘటనను ప్రత్యక్షసాక్షి పోలీస్ సబ్ఇన్స్పెక్టరు బాస్కర్ కదం వివరించారు. కసబ్ ఎ.కె.-47 తుపాకీతో గిర్గౌన్ చౌపటి వద్ద సహాయ సబ్ఇన్స్పెక్టర్ తుకారామ్ ఓంబ్లేను కాల్చాడని బాస్కర్ కోర్టుకు వివరించారు. ముంబయి ఘటనకు సంబంధించి ప్రత్యక్షసాక్షుల విచారణను ప్రత్యేక కోర్టు చేపట్టింది. ‘స్కోడా కారులో వచ్చిన కసబ్, అతని సహాచరుడు అబు ఇస్మాయిల్కు, అధికారులకు మధ్య కాల్పులు జరిగాయి. [...]
మే 8, 2009
తొమ్మిదికి చేరిన భోలక్పూర్ మృతులు
హైదరాబాద్: భోలక్పూర్లోని కలుషిత జలం తాగి అస్వస్థతకు గురై ఇప్పటికే ఎనిమిది మంది మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
మే 8, 2009
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
గుంటూరు: చిలకలూరిపేటలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. పేటకు చెందిన ఖాదీర్కు ఏడేళ్ల కిందట రజీయాతో వివాహమైంది. ఇటీవల కాలంలో వీరి మధ్య స్వల్ప ఘర్ణణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపధ్యంలో రజియా ఆవేశంతో తన ఇద్దరు పిల్లలతో పాటు ఒంటికి నిప్పటించుకుంది. ఘటనలో రజియా అక్కడిక్కడే మరణించగా, పిల్లలు గుంటూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు.
మే 8, 2009
డయేరియాతో 25 మందికి అస్వస్థత
విజయనగరం: జిల్లాలోని గుమ్మలక్ష్మిపురం మండలం కొండవాడలో డయేరియా విజృంభించింది. దీంతో 25 మంది గ్రామస్థులు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 10 మంది చిన్నారులు కూడా ఉన్నారు. అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కలుషిత నీరే కారణమని గ్రామస్థులు ఆరోపించారు.