మనిషిని చంపే హక్కు పోలీసులకెక్కడిది..?

నిజామాబాద్‌: రాష్ట్రంలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లు జరుపుతూ.. కాల్చి చంపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో హై కోర్టు వెలువర్చిన సంచలన తీర్పు పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. `ప్రతీ ఎన్‌కౌంటర్‌ సంఘటనకు సంబంధించి తప్పనిసరిగా పోలీసులపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలివ్వడం సరైన చర్యగా వివిధ పార్టీల నేతలు, విద్యావంతులు పేర్కొన్నారు. ఈ తీర్పు వల్ల బూటకపు ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పడ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తోటి మనిషిని తీవ్రవాదం, తదితర నేరాల ముసుగులో కాల్చి [...]

గుబాలిస్తున్న గంజాయి ఘాటు!

నర్సంపేట (వరంగల్): డివిజన్‌లోని వివిధ మండలాల్లోని సరిహద్దు గ్రామాల్లో గంజాయి పంట అక్రమంగా సాగవుతోంది. ఈ సాగు చాపకింద నీరులా ప్రతియేట విస్తరిస్తూనే ఉంది. తక్కువ పెట్టుబడులతో అధికలాభాలు పొందవచ్చనే ఉద్దేశంతో రైతులు పసుపు, కంది పంట, మిర్చిపంటలలో మిశ్రమ పంట గంజాయిని సాగు చేస్తున్నారు. దీన్ని నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని బాహాటంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డివిజన్‌లోని దుగ్గొండి, చెన్నారావుపేట, గీసుకొండ, ఆత్మకూర్‌ గ్రామాల సరిహద్దు మండలాల్లో గంజాయి అక్రమంగా సాగవుతోంది. [...]

నీరు గారిన ‘ఉపాధి’ పథకం!

అనంతపురం‌: రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకం నీరు గారిపోయిందని టిడిపి, సిపిఎం, సిపిఐ పార్టీల నాయకులు పేర్కొన్నారు. స్థానిక వికె భవన్‌లో శనివారం ఉపాధి హామీ అమలు, ప్రభుత్వ వైకరిపై జరిగిన జిల్లా సదస్సులో ముఖ్య అథితులుగా టిడిపి జిల్లా అధ్యక్షులు ఉన్నం హనుమంతురాయ చౌదరి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఓబుళకొండారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ , ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి [...]

ఫ్యాక్షనిస్టుల ఇళ్లపై కన్ను!

అనంతపురం: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించడం అధికారులకు ఒక ఎత్తయితే అనంతపురం జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడం మరో ఎత్తని చెప్పవ… చ్చు. 2004 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జిల్లాని వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ సంఘటనలకు సంబంధించిన జరిగిన ఘర్షణల వల్ల దాదాపు 180 కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు పోలీసు అధికారులు ముందు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా చర్యలు [...]

పెళ్లిచేసుకోవాలని ఒకరు! భర్తకోసం మరొకరు!!

ఆదిలాబాద్: నాభర్తను నాకు దూరం చేయకండి అని మంచిర్యాలకు చెందిన చంద్రకళ తన భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి సిద్దపడింది. వివరాల్లోకి వెలితే నస్పూర్‌ కాలనీకి చెందిన లెక్కల శంకర్‌ కూతురు చంద్రకళ, మంచిర్యాలకు చెందిన నులిగొండ రాజయ్య కొడుకు మధుకర్‌కు గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి కాగా నాటి నుంచి నేటివరకు దంపతులు ఇద్దరు సవ్యంగా కాపురం చేయలేదని, పెళ్లి అయిన నాటి నుంచి అదనపు కట్నం కోసం తన భర్త తనను వేధిస్తున్నాడని బాధితురాలు [...]

భారీగా ఎరచ్రందనం పట్టివేత

మంచిర్యాల: 30 లక్షల రూపాయలకు పైబడి విలువ కలిగిన ఎర్ర చందనం దుంగలను ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల రేంజ్‌ అటవీ శాఖ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత కరీంనగర్‌, ఆదిలాబాద్‌ సరిహద్దులోని గోదావరి నది సమీపంలోని ఇందారం చెక్‌పోస్టు వద్ద అటవీ సిబ్బంది కాపు కాసి అతి విలువైన ఎరచ్రందనాన్ని పట్టుకున్నారు. విజిలెన్స్ వర్గాల సమాచారంతో ఈ కలప లారీని పట్టుకున్నట్లు పైలయింగ్‌ స్కా్వడ్‌ డిఎఫ్‌ఓ ఆంజనేయులు తెలిపారు, ఇంకా దాడిలో [...]

రంగుమారుతున్న గులాబీ!

గులాబీ తోటలను పెంచటంమంటే ఆమెకు భలే సరదా. గులాబీ మొక్కలను పెంచుకుంటూ వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించుకుంటోందామె. అయితే ఈ ఏడాది దిగుబడి సరిగా రాకపోవటంతో పాటు మొక్కలకు పురుగు సోకటంతో ఆమెకు కన్నీళ్లే మిగిలాయి. ప్రకాశంజిల్లా గిద్దలూరుకిచెందిన గురవమ్మకు గులాబీ తోటల పెంపకమంటే ఎంతో ఇష్టం. అంతే ఇష్టంతో కర్నాటకనుంచి మొక్కలను తెచ్చి మూడు సంవత్సరాలుగా తోటను సాగు చేసింది. ఒక్కోఎకరానికి నలభై వేల నుంచి యాభైవేల వరకు ఖర్చు చేసి తోటను కాపాడుకుంటూ [...]

ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న కోతి

శ్రీకాకుళం : కోతులంటే శ్రీకాకుళం వాసులు భయపడిపోతున్నారు. ఓ తిక్కరేగిన కోతి కనిపించిన పౌరులపై దాడికి దిగడంతో ఆ కోతి కనిపించే సరికి గజగజలాడిపోతున్నారు. దాని పుణ్యమా అని ఇప్పటికే ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు. కోతి చేసే పనులు అల్లరి చిల్లరగా ఉన్నా మనకు మాత్రం తమాషా తెప్పిస్తాయి. అయితే శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ కోతి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్న ఈ మర్కాటం జాతి వైరాన్ని మరచి కుక్కలతో [...]

పాము విషంతో ఔషధాల తయారీ

పాము విషం సేకరించి దాన్ని ఔషధాల తయారీకి అందజేయడం ఆ యువకుల నిత్యకృత్యం శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాలు సంచరించి పాములను పట్టుకుని వాటి విషాన్ని వైద్యులకు అమ్ముతారు. వీరు అందజేసిన స్నేక్‌ పాయిజన్‌ను ఔషధాల తయారీలో వినియోగించడమే కాక ఏంటీ వీనమ్‌గా కూడా ఉపయోగిస్తారు. ప్రాణాలకు తెగించి, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తాము పాము విషాన్ని సేకరిస్తున్నామని అయినా తమ బతుకులు అంతంత మాత్రమే అని పాముల వేటగాళ్లు అంటున్నారు.

శ్రీకాకుళంలో ఏనుగుల భయం

ప్రశాంతంగా వున్న గిరిజన గ్రామాల్లో అలజడి మొదలైంది. గత కొన్నాళ్లుగా ఎలాంటి భయం లేకుండా వున్న ఏజన్సీ ప్రాంతాల్లో ఏనుగులు గిరిజనులను వణికిస్తున్నాయి. రాత్రిళ్లు ఏనుగులు రెచ్చిపోతుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని జనం జంకుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏజన్సీలో తిష్టవేసిన ఏనుగులు మళ్ళీ గ్రామాల్లోకి వస్తున్నాయి. మారుమూల ప్రాంతాలైన మానాపురం, కొత్తకోటలతోపాటు పలు గ్రామాల్లో గజరాజులు తిరుగుతున్నాయి. పెద్దగా ఘీంకరిస్తూ కొండలనుంచి జనావాసాల్లోకి గుంపులు గుంపులుగా వస్తున్నాయి. దీంతో ఇక్కడి గ్రామాలప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని కాలం [...]

Follow

Get every new post delivered to your Inbox.