బయోగ్యాస్‌ ప్లాంట్ల నిర్మాణంలో ‘ప్రథమం’

ఖమ్మం: అత్యధికంగా బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మించినజిల్లాల్లో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నెడ్‌ క్యాప్‌ ద్వారా రాష్ట్రస్థాయిలో అమలు చేస్తున్న తరగని ఇంధన వనరుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విరివిగా బయోగ్యాస్‌ ప్లాంట్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ స్థానాన్ని పొందుతోంది. నెడ్‌ క్యాప్‌ వైస్‌ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.పి.రెడ్డి హైదరాబాద్‌ నుంచి కలెక్టర్‌కు ఈ బహుమతిని పంపారు. జిల్లాలో నెడ్‌ క్యాప్‌ [...]

ఎన్‌కౌంటర్‌ కాదది… ఆదివాసీల ఊచకోత

భద్రాచలం: ఈ నెల 8వ తేదీన మధ్యాహ్నం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగారం అడవుల్లో జరిగింది ఎన్‌కౌంటర్‌ కాదని, అది ఆదివాసీల భారీ ఊచకోత అని 4 రాష్ట్రాల పౌరహక్కుల సంఘాలు ఆరోపించాయి. ఆంధ్రా, కర్నాటక, న్యూఢిల్లీ, నాగాలాండ్‌కు చెందిన వివిధ పౌరహక్కుల సంఘాల నేతలు రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సింగారం అడవుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు భద్రాచలంలో ఆదివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ [...]

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడిగా పెద్దన్న

అనంతపురం: ప్రప్రథమంగా ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గం ఎంపికైంది. ఈ మేరకు ఆదివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో ఆ సంఘం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య ముఖ్యఅతిథిగా హాజరైన నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎస్‌.పెద్దన్న, ప్రధాన కార్యదర్శిగా బి.శంకర్‌, సహాధ్యక్షుడిగా ఎస్‌.రామలింగం, కోశాధికారిగా కె.శంకరయ్య, గౌరవాధ్యక్షుడిగా ఎం.అంజయ్యలు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎం.జగదీష్‌, బి.సుధాకర్‌నాయక్‌, కె.తిరుపాల్‌నాయక్‌, హెచ్‌.హనుమంతు, ఎం.రామకృష్ణ, ఎస్‌.రామానాయక్‌, కార్యదర్శులుగా [...]

మావోయిస్టులకు ఎఎస్పీ తరుణ్‌జోషి పిలుపు

నేరడిగొండ: లొంగిపోతే పునరావాసం కల్పిస్తామని ఎఎస్పీ తరుణ్‌జోషి అజ్ఞాత మావోయిస్టులకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ నిర్వహించిన మావోయిస్టు, సానుభూతిపరుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పోలీసులు ప్రజల కోసం ఉన్నారని, సంఘ వ్యతిరేకశక్తులకు గ్రామీణులు ఆశ్రయం కల్పించవద్దని సూచించారు. ఎవరిని బాధించాలనే ఆలోచన పోలీసులకు లేదన్నారు. ఈసందర్భంగా అజ్ఞాత మావోయిస్టుల కుటుంబసభ్యులకు దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో సీఐ చంద్రప్రభు, ఎస్సైలు జబ్బార్‌, పురుషోత్తంచారిలు, ఎంపీపీ సాబ్లె ప్రేంసింగ్‌, జడ్పీటీసీ పండరి, స్థానిక సర్పంచి సజన్‌, [...]

అచేతనావస్థలో భర్త.. మంచంపట్టిన కూతురు!

మంచిర్యాల: కూతురి అనారోగ్యం.. ఏడు పదులు దాటి అచేతన స్థితిలో ఉన్న భర్త.. ఎదుగుతున్న కూతురి పిల్లలు.. ఆపై కుటుంబ పోషణ భారం.. ఇవన్ని తలకుమించిన భారమై.. మానసికంగా కుంగిపోయిన ఓ వృద్ధురాలు శనివారం తెల్లవారుజామున బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మంచిర్యాలలో జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మంచిర్యాల మండలం ముల్కల్ల గ్రామానికి చెందిన సాగే గోపాల్‌రావు, పద్మావతి(60) దంపతులు మంచిర్యాలలో స్థిరపడ్డారు. 15 ఏళ్ల క్రితం కరీంనగర్‌ జిల్లా చాకుంట గ్రామానికి చెందిన [...]

బాక్సైట్‌ వెనుకా ‘ప్రైస్‌వాటర్‌’

సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆడిటింగ్‌ సంస్థ ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ (పీడబ్ల్యూసీ)నుంచి రాష్ట్ర సర్కారు కూడా ‘విలువైన’ సూచనలు స్వీకరించింది. వేల కోట్ల రూపాయల బాక్సైట్‌ నిక్షేపాలను రెండు ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే విషయంలో ఈ సంస్థ ప్రభుత్వానికి కన్సల్టెంట్‌గా వ్యవహరించింది. విజయనగరం జిల్లాలో జిందాల్‌ గ్రూపు ‘జేఎస్‌డబ్ల్యూ అల్యూమినియం లిమిటెడ్‌’ పేరుతో, విశాఖ జిల్లాలో రస్‌ అల్‌ ఖైమా కంపెనీ ‘ఆన్‌రాక్‌ అల్యూమినియం’ పేరుతో భారీ అల్యూమినియం కర్మాగారాలను [...]

బీబీసీపై పర్యటించిన ఎమ్మెల్యే కట్టా

బోనకల్లు: బీబీసీ పరిధిలో ఎండిపోతున్న పంటలను బుధవారం మధిర శాసనసభ్యుడు కట్టా వెంకటనర్సయ్య పరిశీలించారు. నారాయణపురం రైతులను ఆయన కలిసి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన రైతులు మంగళవారం ఖమ్మం వెళ్లి ఎన్‌ఎస్‌పీ కార్యాలయాన్ని ముట్టడిస్తే… పాలేరు జలాశయంలో నీళ్లు లేవని చెప్పడం తప్ప వారి బాధని అధికారులు అర్థం చేసుకునే స్థితిలో లేరన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే, సీఈతో ఫోన్లో ఆయన మాట్లాడిన తర్వాత 500 క్యూసెక్కుల నీటిని [...]

మిర్చి రైతు దిగాలు!

నరసరావుపేట: మిర్చి పంట దిగుబడులు తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం కొద్దిపాటి నష్టాలతో బయటపడిన రైతులు ఈ ఏడాది ఆశ తుపాను ప్రభావానికి విలవిల్లాడారు. జిల్లాలో ఆరంభమైన మిర్చి దిగుబడులు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. క్వింటా నాలుగు వేల రూపాయల ధర పలుకుతున్నా నష్టాలు తప్పవంటున్నారు రైతులు.  గత సంవత్సరం ఈ పంట సాగు చేసిన వారికి మిశ్రమ ఫలితాలందాయి. సంక్రాంతి సమయంలో మొదటి దఫా కోత కోసిన రైతులకు లాభాలొచ్చాయి. అనంతరం [...]

గోదావరిలో అడుగంటుతున్న నీరు

రాజమండ్రి: గోదావరిలో జల సంక్షోభం మరింత పెరుగుతోంది. ఒకపక్క రబీ పంటపై ఆశలు ఆవిరవుతుంటే… డెల్టాలో తాగునీటికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రానున్నది ఎండాకాలం కావడంతో పరిస్థితిపై మరింత ఆందోళన నెలకొంది…  నీటికొరత ఏర్పడటంతో ఇప్పటికే రబీలో వేసిన లక్షలాది ఎకరాల పంట నాశనమైపోవడంతో ఉభయగోదావరి జిల్లాలోని రైతులు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇక జిల్లాలోని పలు ప్రాంతాలు గోదావరి నీటినే తాగునీటికి కటకట ఏర్పడి జనం గొంతు తడిసే పరిస్థితి కనిపించడంలేదని అధికారులు [...]

జిల్లా సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్‌

మదనపల్లె: చిత్తూరు-కడప జిల్లాల సరిహద్దుల్లోని పెద్దమండ్యం, చిన్నమండ్యం, తంబళ్ళపల్లె ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉన్న ప్రాంతం కావడంతో ముందుజాగ్రత్తగా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఈనెల 23న పెద్దమండ్యం మండలంలోని కలిచెర్లకు వస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్న 2 గంటల నుంచి 4.30 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. రెండు రోజులుగా 5 [...]

Follow

Get every new post delivered to your Inbox.