రంగా వర్థంతి గొడవలో పలువురి అరెస్టులు

విజయవాడ: విజయవాడలో వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన ఘర్షణలు, పరస్పర దాడుల్లో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగా విగ్రహంపై కాంగ్రెస్‌ కండువాను ఆ పార్టీ కార్యకర్తలు కప్పటాన్ని రాధా అనుచరులు అడ్డుకోవటంతో వివాదం మొదలై దాడులకు దారితీసింది. దీంతో రంగా కుమారుడు రాధా అనుచరులు నలుగురిపైన, కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

భీమ్‌రావువాడ ఘటనలో చంద్రబాబు అరెస్టు

హైదరాబాద్‌: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టు చేశారు. భీమ్‌రావువాడ పేదల ఇళ్లను ఖాళీచేయించటాన్ని నిరసిస్తూ వారికి సంఘీభావాన్ని ఆయన ప్రకటించారు. వారికి అక్కడే తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు అక్కడినుంచి కదలమని ఆయన నడిరోడ్డుపై బైఠాయించటంతో ట్రాఫిక్‌ స్థంభించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడినుంచి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇక్కడే ఇళ్లు కట్టించేవరకు కదలం : బాబు

హైదరాబాద్‌: భీమ్‌రావ్‌వాడ పేదలకు తిరిగి ఇక్కడే ఇళ్లు కట్టించి ఇచ్చేవరకు కదలమని, వారి తరపున పోరాడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. భీమ్‌రావ్‌వాడ బాధితులను ఆయన పరామర్శించారు. ఇందిరాభవన్‌ నిర్మాణానికి పేదల ఇళ్లే కావాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బందిపోట్లలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను అడ్డుకున్న పోలీసులు ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేశారు.

పోలీస్‌స్టేషన్‌ ఎదుట టీడీపీ ధర్నా

హైదరాబాద్‌: భామ్‌రావువాడలో బాధితులకు మద్దతు తెలిపిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించటంతో ఆ పార్టీ కార్యకర్తలు వారిని ఉంచిన గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ముందు ధర్నా చేశారు. నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

శ్రీవారి దర్శనానికి 14 గంటలు

తిరుపతి: తిరుమలలో తీవ్ర రద్దీ నెలకొంది. సంవత్సరం చివరలో ఎప్పటిలాగే ఇక్కడ మహా రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ దాటి 4 కిలోమీటర్ల మేర లైన్లు ఉండటంతో శ్రీవారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.

యుద్ధంపై స్వరాన్ని తగ్గించిన పాక్‌

ఇస్లామాబాద్‌: పాక్‌ వ్యాఖ్యలు, చర్యలపై అంతర్జాతీయంగా రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుండటం, ఇతర దేశాల ఒత్తిళ్లతో పాక్‌ కొంత వెనుకకు తగ్గింది. యుద్ధానికి సిద్ధమంటూ పెంచిన స్వరాన్ని తగ్గించింది. తమ వైపునుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ ఉండవని, యుద్ధంకోసం తాము ఉబలాటపడటంలేదని ఐరాస ప్రతినిధులకు, భారత్‌కు స్పష్టం చేసింది. ఐరాస శాశ్వత సభ్యత్వ దేశాలైన జపాన్‌, జర్మనీ, అమెరికా, రష్యా, యుకె ప్రతినిధులు పాక్‌ విదేశాంగశాఖ కార్యదర్శి సల్మాన్‌ బషీర్‌తో భేటీ అయ్యారు. వారితో భారత్‌ను కవ్వించే ఎలాంటి [...]

ఇలియానాకు బెస్ట్ రెస్ట్!

తినికూర్చున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో బెస్ట్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిన ఆహార్యంలో అనూహ్య మార్పులు వస్తాయనే బెంగ చాలామందిలో ఉంటుంది. గ్లామర్ వరల్డ్ లో ఉన్న వాళ్లకైతే ఈ బెంగ మరింత ఎక్కువ. నాలుగు పెద్ద చిత్రాలు, బిజీ షూటింగ్ షెడ్యూల్స్ ఉన్న గ్లామర్ నటి ఇలియానాకు ఇప్పుడు బెస్ట్ రెస్ట్ బెంగ పట్టుకుందట. నాలుగైదు రోజుల క్రితం నితిన్ తో కలిసి నటిస్తున్న చిత్రంలో ఓ డాన్స్ సీక్వెన్స్ లో పాల్గొన్నప్పుడు ఇలియానా కుడికాలి చీలమండకు గాయమైంది. [...]

భారత్‌లో సాకర్‌ అభివృద్ధికి కృషి : మారడోనా

భారత్ లో సాకర్ అభివృద్దికి తన సేవలందించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రఖ్యాత సాకర్ దిగ్గజం మారడోనా తెలిపారు. రెండు రోజుల పర్యటనకు భారత్ వచ్చిన సాకర్ మాంత్రికునికి కోల్‌కతాలో ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. భారతావనిలో తనకు లభించిన స్వాగతంతో అర్జెంటీనా దిగ్గజం పులకించిపోయాడు. క్రికెట్‌ను శ్వాసించే దేశంలో తనకింత మంది అభిమానులున్నారాంటూ ఆశ్చర్యం చెందాడు. అర్జెంటీనాతో ఒప్పందం ముగిశాక భారత్‌కు తన సేవలందించడానికి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కోల్‌కతాలోని ఇండియన్ ఫుట్‌బాల్ స్కూల్ కు [...]

అవిటి భార్యను కంటికి రెప్పలా చూసుకుంటున్న భర్త!

భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్యలు సేవలు చేస్తూ కంటికి రెప్పలా చూసుకోవడం మనం సినిమాల్లోనే కాదు, బాహ్య ప్రపంచంలో కూడా చూశాం. తమ భర్తలు అనారోగ్యంగా ఉంటే వారికి సేవలు చేసేది భార్యలేనని పురాణాలు కూడా చెబుతున్నాయి. దీనికి సాక్ష్యం సతీ అనసూయ కథే, అయితే కొన్ని సినిమాల్లో మాత్రం భార్యలకు, భర్తలు కూడా సేవలు చేశారు. అచ్చం సినిమా కథలాగే ఉంది కేరళకి చెందిన సుందర్‌ లవ్‌ స్టోరీ.. తాను ప్రేమించిన అమ్మాయి నడవలేదని తెలిసి [...]

గృహ హింసకు గురవుతున్న శ్రీలంక మహిళలు!

అనేక సామాజిక సూచికలు మెరుగ్గా ఉన్న శ్రీలంక దేశంలోనూ స్త్రీల పరిస్థితి, మిగతా దేశాల స్త్రీల పరిస్థితికంటే ఏ మాత్రం భిన్నంగా లేదు. లైంగికత ప్రాతిపదికగా జరిగే హింస వేదిక (జీబీవీ ఫోరమ్) చేపట్టిన సర్వేలో వెల్లడైన అంశాలు కూడా పై విషయాన్నే నిర్ధారిస్తున్నాయి. శ్రీలంక మొత్తంమీదా కనీసం 60 శాతం మహిళలు గృహ హింసకు గురవుతున్నారని, అంతేగాకుండా, జాతి, తెగ, మతం, వర్గం లాంటి తేడాలేమీ లేకుండా సర్వత్రా గృహ హింస విస్తృతంగా అమలవుతోందని తమ [...]

Follow

Get every new post delivered to your Inbox.