విజయవాడ: విజయవాడలో వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన ఘర్షణలు, పరస్పర దాడుల్లో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రంగా విగ్రహంపై కాంగ్రెస్ కండువాను ఆ పార్టీ కార్యకర్తలు కప్పటాన్ని రాధా అనుచరులు అడ్డుకోవటంతో వివాదం మొదలై దాడులకు దారితీసింది. దీంతో రంగా కుమారుడు రాధా అనుచరులు నలుగురిపైన, కాంగ్రెస్ కార్యకర్త ఒకరిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.
డిసెంబరు 2008 నుండి టపాలు
డిసెంబరు 27, 2008
భీమ్రావువాడ ఘటనలో చంద్రబాబు అరెస్టు
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును పోలీసులు అరెస్టు చేశారు. భీమ్రావువాడ పేదల ఇళ్లను ఖాళీచేయించటాన్ని నిరసిస్తూ వారికి సంఘీభావాన్ని ఆయన ప్రకటించారు. వారికి అక్కడే తిరిగి ఇళ్లు నిర్మించి ఇచ్చేవరకు అక్కడినుంచి కదలమని ఆయన నడిరోడ్డుపై బైఠాయించటంతో ట్రాఫిక్ స్థంభించింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అక్కడినుంచి నాంపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు.
డిసెంబరు 27, 2008
ఇక్కడే ఇళ్లు కట్టించేవరకు కదలం : బాబు
హైదరాబాద్: భీమ్రావ్వాడ పేదలకు తిరిగి ఇక్కడే ఇళ్లు కట్టించి ఇచ్చేవరకు కదలమని, వారి తరపున పోరాడతామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. భీమ్రావ్వాడ బాధితులను ఆయన పరామర్శించారు. ఇందిరాభవన్ నిర్మాణానికి పేదల ఇళ్లే కావాలా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం బందిపోట్లలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను అడ్డుకున్న పోలీసులు ఆయన వెంట వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేశారు.
డిసెంబరు 27, 2008
పోలీస్స్టేషన్ ఎదుట టీడీపీ ధర్నా
హైదరాబాద్: భామ్రావువాడలో బాధితులకు మద్దతు తెలిపిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించటంతో ఆ పార్టీ కార్యకర్తలు వారిని ఉంచిన గాంధీనగర్ పోలీస్స్టేషన్ముందు ధర్నా చేశారు. నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
డిసెంబరు 27, 2008
శ్రీవారి దర్శనానికి 14 గంటలు
తిరుపతి: తిరుమలలో తీవ్ర రద్దీ నెలకొంది. సంవత్సరం చివరలో ఎప్పటిలాగే ఇక్కడ మహా రద్దీ నెలకొంది. కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఉన్నాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్ దాటి 4 కిలోమీటర్ల మేర లైన్లు ఉండటంతో శ్రీవారి దర్శనానికి 14 నుంచి 16 గంటల సమయం పడుతోంది. ఈ రద్దీ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.