విశాఖపట్నం: పెను తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారి కర్నాటక, రాయలసీమలకు ఆనుకుని మారుమూల తమిళనాడులో కేంద్రీకతమై వుంది. ఇది వాయువ్య దిశగా పయనించి మరింత బలహీనపడుతుంది. ఇదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా, తెలంగాణాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గడిచిన ఇరవై నాలుగు [...]
నవంబరు 2008 నుండి టపాలు
నవంబరు 29, 2008
భారత్ కమెండోల సాహసాలకు చిత్తైన నరహంతకులు
నారిమన్ హౌజ్ను ఉగ్రవాదుల చెర నుంచి విడిపించిన కొద్ది సేపటికే ట్రెడెండ్ హోటల్లోని బంధీలకు కూడా విముక్తి లభించింది. నలబై గంటల పాటు సైన్యం సాగించిన పోరుతో టెర్రరిస్టులు తలవంచక తప్పలేదు. ముంబయ్ మహానగరంలో అత్యంత ఖరీదైన బిజినెస్ సెంటర్ నారిమన్ పాయింట్ దగ్గర అరేబియా మహా సముద్రానికి అభిముఖంగా ఠీవిగా కన్పించేదే ఓబెరాయ్ హోటల్. వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చే బిగ్ షాట్స్ అంతా ఎక్కువగా ఇందులో బస చేస్తారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ [...]
నవంబరు 29, 2008
బెంగుళూరు – మచిలీపట్నంల మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, మచిలీపట్నాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి పనబాక కృష్ణయ్య తెలిపారు. కాచిగూడ-బెంగళూరు (రైల్ నెంబర్ 789) స్పెషల్: డిసెంబర్ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో కాచిగూడ నుంచి రాత్రి 9.55కు బయల్దేరి మర్నాటి రోజు మధ్యాహ్నం 12.10కు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (నెం.790) డిసెంబర్ 8, 15, 22, 29, జనవరి 5, [...]
నవంబరు 29, 2008
తాజ్లో ముగిసిన పోరు
ముంబయి: తాజ్హోటల్లో రాత్రినుంచి కొనసాగుతున్న ఆపరేషన్ సైక్లోన్ కార్యక్రమం ఎట్టకేలకు ఈరోజు ఉదయం ముగిసింది. ముగ్గురు తీవ్రవాదులు అంతమయ్యారు. హోటల్ కమెండోల హస్తగతం అయింది. తాజ్ ఫస్ట్ఫ్లోర్లోని కారిడార్లలో ఈరోజు ఉదయం ఆరుగంటలనుంచి భీకర పోరు కొనసాగింది. కాల్పులు, మంటలతో ఆ ప్రాంతం యుద్ధభూమిని తలపించింది. కమెండోలు అన్ని వైపులనుంచి చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో కమెండోలు ఓ శవాన్ని బయటకు విసిరివేశారు. మరో ఇద్దరు తీవ్రవాదులు కూడా మృతి చెందారని తెలుస్తోంది. [...]
నవంబరు 29, 2008
5 గురు ఉగ్రవాదుల హతం : తనిఖీ ముమ్మరం
ముంబయి: తాజ్ హోటల్లో ఆపరేషన్ పూర్తిగా ముగిసినట్లు కాదని హోటల్ మొత్తం గాలించి అన్ని విషయాలు ధృవీకరించుకున్నాకే ఇది ముగిసినట్లు భావించాలని ఎన్ఎస్జీ చీఫ్ దత్ తెలిపారు. ఈరోజు ఉదయం ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటివరకు చేసిన దాడుల గురించి తెలిపారు. తాజ్లో ముగ్గురు తీవ్రవాదులు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని, కొన్ని గ్రెనేడ్లు, ఏకే 47లు కూడా తమకు దొరికాయని ఆయన చెప్పారు. తమ కమాండర్ ఒకరు వారితో పోరాడుతూ వీరమరణం పొందారని చెప్పారు. ఇంకా [...]